అందరికి నమస్కారం, ప్రింట్ మీడియాలో నానోల విప్లవాన్ని చూడండి & visit NANOLU group in facebook also ఈగ హనుమాన్

Wednesday, April 15, 2009

డా|| అద్దేపల్లి రామమోహన రావు గారు, ఈగ హనుమాన్ "నానోలు, కవిత్వం X 10-9" సంపుటి కి రాసిన ముందు మాట:

"స్తూల వస్తువు - సూక్ష్మ రూపం - నానోలు"
డా|| అద్దేపల్లి రామమోహన రావు
డి:25-02-2006


ఇటీవలి కాలంలో కవిత్వంలో లఘురూపాలకి బహుళ ప్రాచుర్యం వచ్చింది. మినీ కవిత, హైకు ప్రబలంగా ఉన్న సమయాల్లో ఆ రూపాలే ప్రధానంగా ఉండేవి. కాని ఇప్పుడు ఎన్నో రూపాలు, రూపాల్లో ప్రయోగాలు జరగడం ఎక్కువైంది. ప్రయోగంలో జనాకర్షణ, రాసే అనుకూలత ఉంటే, కొంత మంది అనుసరిస్తారు. వేరే రుపాలు కూడా వచ్చినై కానీ, అవి వైయుక్తికంగానే ఆగిపొయినై. ఏమైనా, అనువైన భావాన్ని చెప్పడానికి పుట్టిన రూపం ఏదో ఒక వైచిత్రి, ప్రత్యేకత ఉంటే అణుసరణీయమౌతుంది. లఘురూపాల మీద ఉన్న ఆకర్షనలో మరో అంశం గమనించవచ్చు: మినీ కవిత ఎక్కువగా యువ కవులు రాసినచో సామాజిక తత్వం అందులో ప్రధానంగా ఉండేది. అలాగే హైకూలలో అనుభూతి కేంద్రీకరణ ముఖ్యంగా కనిపించేది. కాని ఇప్పుడు అన్ని రూపాల్ని అన్ని వస్తువులకి వినియోగించడం కనిపిస్తుంది.

ఇప్పుడు ఈగ హనుమాన్ "నానో" అనే రూపాన్ని తన భావావిష్కరణకి ఒదిగిన లఘురూపంగా ముందుకు తెస్తున్నాడు. 'నానో' అనే పదం 'నానీ' అనే పదానికి దగ్గరగానే ఉంది గాని, హనుమాన్ ఈ పదాన్ని సమకాలీన శాస్త్ర విజ్ఞాన పరిధి లోంచి తీసుకున్నాడు. 'నానోటెక్నాలజీ' ఇప్పుడు శాస్త్రవేత్తలందరినీ కుదిపేస్తున్న అంశం. పరమాణువు దగ్గర మార్పులు చేస్తే ఒక వస్తువు మరో వస్తువైపోతుంది. బొగ్గు, వజ్రమైపోతుంది, ఇనుము బంగారమైపోతుంది. ఇది పదార్థ అద్వైత సిద్ధాంతం. స్థూలం లోంచి సూక్ష్మం లోకి పొవడం. అప్పుడు మెగా పరిశ్రమలన్నీ మినీ రూపాలకి వస్తై. మొత్తం మీద అణువైనత సూక్ష్మ రూపం లోకి పయనించడం నానో టెక్నాలజీ. కవిత్వం విషయం ఆలోచించినపుడు "నానో" అనే దానికి హనుమాన్ చేసిన అభివ్యక్తి: నాలుగు పాదాలు, ప్రతి పాదంలో ఒక్కటే పదం. ఇంతకు ముందు ఇలాంటి ప్రయోగం జరిగింది కానీ వాటిలో శబ్ధ వైచిత్రికి అనుప్రాసాలదులకి యెక్కువ ప్రధాన్యం ఇవ్వబడింది. హనుమాన్ భావ ప్రాాన్యాయాన్ని పాటించాడు.

లఘు రూపం ఏదైనా భావాన్ని క్లుప్తత లోకి ఒదిగించే ప్రయత్నమే. 'నానో' లఘురూపానికి పరాకాష్ట కాబట్టి, క్లుప్తతకి ఇంకా అవసరం ఉంటుంది. ధ్వని శక్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

"పేరెంట్స్
ప్రేమించకపోతే
పక్కింటబ్బయి
ప్రేమిస్తాడు-"

రెండు, నాలుగు పాదాల్లో 'ప్రెమా అనే ఒక్క శభాన్ని గ్రహించి అర్ధాలు మార్చడం, పై ప్రేమ వ్యతిరేఖ భావాన్ని, క్రింది ప్రేమ అనుకోల భావాన్ని చెప్పే వైరుధ్యం, చూడగానె కనిపించె వైచిత్రి. కానీ, లోతుకు వెళితే వచ్చే అర్ధం, ఇంట్లో క్రమశిక్షణ లేకపోతే, బయట ప్రమాదం పాలయ్యే అవకాశం ఉందనీ సామాజిక అంశాన్ని ధ్వనింప చేస్తుంది.

"తెంపబడే
పోగులన్నీ
పోగైతే
ఉరితాడే-"

ఈ 'నానో' లొ 'పోగూ రెండు అర్ధాలలో వినియోగించబడింది. 'పోగూ అత్యల్ప జీవి, ఇతడు హింసించబడుతున్నాడు. ఇలాంటి వాల్లు పోగైతే, సమూహంగా చేరితే, హింసించే వాడికి ఉరితాడు అవుతుంది. 'పోగూ శబ్ధం లోని వైచిత్రి ద్వరా అట్టడుగు జనుల ప్రతిఘటన ధ్వనించింది.

భావాన్ని, భాషనీ అత్యంత క్లుప్తం చేస్తున్నపుడు అనేక అభివ్యక్తులు వాటంతటవే వస్తై. మినీ కవితలొ, హైకూలలో ఎన్నెన్నో విమర్శకులు విశ్లేశించి ఉన్నారు. వాటి కంటే భిన్నమైనవి 'నానోలూ లొ రాగలవని నా అభిప్రాయం కాదు. ఎందుకంటే, క్లుప్తతా మార్గంలో వచ్చే అభివ్యక్తులు పోలిక కలిగే ఉంటయి. అయితే సమర్ధంగా కవి వినియోగించుకోగలిగాడా అన్నదే ప్రశ్న అవుతుంది. 'నానోల్లో' నాలుగు పాదాల్లొ ఒక్కొక్క పదమే కాబట్టి ఎక్కువ స్ఫురణకి కొన్ని చోట్ల అవకాశం వస్తుంది...


ఈ మార్గంలో హనుమాన్ నానోలలో కనిపించే కొన్ని వింగడించవచ్చు.

అక్షరాల పునరావృతి చిన్న కవిత లోనికి భావనని తేవడానికి ఉపయోగపడుతుంది.

జాడలు
మరిస్తే
మేడలు
కూలుతాయి-

మొత్తం నానోలోని ధ్వని ఒక సామాజిక లక్ష్యంతో ఏర్పడ్డ ఏర్పడ్డ సూత్రాలు భవిశ్యత్ సమాజ నిర్మాణనికి పునాదులుగ ఉంటై. లక్ష్యం మధ్యలో దెబ్బతినడానికి కారణం సూత్రాల్ని నిండుగా అనుసరించలేకపోవడమే. ఇందులో జాడలు, మేడలు అక్షరాల పోలిక కలిగి ఉన్నై. దీనివల్ల జాడలకి మేడలకి ఉన్న కార్య కారణ సంభందం లోని పోలిక కూడా స్ఫురిస్తుంది. ఈ తీరు ఈ సంపుటి లోని నానోలలో అధిక భాగం గమనించవచ్చు.

గేయం
గాయమై
గాయం
గేయమౌను-
గేయం అనే పదం కవిత్వానికి పర్యాయ పదం అనుకుంటే బలమైన కవిత్వం చదివితే గుండె కదులుతుంది, చదివిన వాడు కవి అయితే అలా గుండె కదిలినప్పుడు అది మరో గేయానికి ప్రేరణనిస్తుంది. నాలుగు పాదాల్లోని శబ్ధ వైచిత్రి మాత్రమే కాక మొదటి అక్షరాలన్నీ ఒకటిగానే ఉండడం వల్ల కూడా భావానికి బలం వస్తోంది.

సూక్ష్మ రూపంలో ఉన్న అవకాశం వల్ల భావానా శాక్తితో కూడిన కొన్ని నానోల్లో పాఠకుడు కవి చెప్పని అనుభూతి పొరల్లోకి ప్రయానించే అవకశముంది.
ఉదాహరణకి:
గంతలు
బిగించినా
ఒళ్ళంతా
కళ్ళవుతై-

'గంతలు కళ్ళు కంబడకుండా కట్టేవి. గంతలు కడితే ఒంటి నిండా కళ్ళు నిండి పోతై. అంటె ఏది ముఖ్యమో దాన్ని నిరోధిస్తే అది తన లక్ష్యాన్ని వదలదు. మరో రకంగా వేరు ప్రదేశాల్లో నుండి అదివరకటి శక్తిని వంద రెట్లు ప్రదర్శిస్తుంది. సాదారణంగా నేత్రాలు లేని వారు, నేత్రాలు ఉన్న వారి కంటే ఎక్కువ స్పృహని మరో విధంగా కలిగి ఉంటారనేది లోకంలో గమనించేదే. అయితే దీన్ని ఆధారంగా ఆలోచిస్తే పైన భావం స్ఫురిస్తుంది. ఇంకో విధంగా సమకాలీన విషయ నేపధ్యంలో ఒక రచనని ప్రభుత్వం నిషేధిస్తే ఆ స్ఫుర్తి ఆగదనీ మరో విధంగ వందరెట్లు వ్యక్తమవుతుందని కూడా వెంటనే తట్టుతుంది. ఇది స్ఫురించడానికి పైన చెప్పినట్లు సమకాలినత ప్రధానమవుతుంది. మరో తక్షణ స్ఫూర్తి, నిరోధించడం చేత, మంచి భావలు ఆగకపోవడం, మనిషి లోని సంకల్ప శక్తి వల్లనే. ఆ సంకల్ప శక్తిని కూడా ఈ నానో ధ్వనింప చేస్తుంది. ఇలాంటివి ఈ సంపుటిలో కొద్ది సంఖ్యలోనే ఉన్నా ఈ పార్శ్వం వినియోగించడంలోనే మెళకువకే పై ఉదాహరణ.



సూక్ష్మ రూపంలో ఉన్న అవకాశం వల్ల భావానా శాక్తితో కూడిన కొన్ని నానోల్లో పాఠకుడు కవి చెప్పని అనుభూతి పొరల్లోకి ప్రయానించే అవకశముంది.
ఉదాహరణకి:
గంతలు
బిగించినా
ఒళ్ళంతా
కళ్ళవుతై-

'గంతలు కళ్ళు కంబడకుండా కట్టేవి. గంతలు కడితే ఒంటి నిండా కళ్ళు నిండి పోతై. అంటె ఏది ముఖ్యమో దాన్ని నిరోధిస్తే అది తన లక్ష్యాన్ని వదలదు. మరో రకంగా వేరు ప్రదేశాల్లో నుండి అదివరకటి శక్తిని వంద రెట్లు ప్రదర్శిస్తుంది. సాదారణంగా నేత్రాలు లేని వారు, నేత్రాలు ఉన్న వారి కంటే ఎక్కువ స్పృహని మరో విధంగా కలిగి ఉంటారనేది లోకంలో గమనించేదే. అయితే దీన్ని ఆధారంగా ఆలోచిస్తే పైన భావం స్ఫురిస్తుంది. ఇంకో విధంగా సమకాలీన విషయ నేపధ్యంలో ఒక రచనని ప్రభుత్వం నిషేధిస్తే ఆ స్ఫుర్తి ఆగదనీ మరో విధంగ వందరెట్లు వ్యక్తమవుతుందని కూడా వెంటనే తట్టుతుంది. ఇది స్ఫురించడానికి పైన చెప్పినట్లు సమకాలినత ప్రధానమవుతుంది. మరో తక్షణ స్ఫూర్తి, నిరోధించడం చేత, మంచి భావలు ఆగకపోవడం, మనిషి లోని సంకల్ప శక్తి వల్లనే. ఆ సంకల్ప శక్తిని కూడా ఈ నానో ధ్వనింప చేస్తుంది. ఇలాంటివి ఈ సంపుటిలో కొద్ది సంఖ్యలోనే ఉన్నా ఈ పార్శ్వం వినియోగించడంలోనే మెళకువకే పై ఉదాహరణ.

ఇప్పుడు వస్తున్న లఘు రూపాలన్నీ పూర్తిగా కొత్తవని చెప్పడానికి సాధ్యం కాదు. ఇదివరలో ఒక నియతితో లేని రూపాన్ని ఏదొ విధంగా నిబద్ధం చేయబడంలో అది ప్రత్యేక ఆకర్శణ అవుతుంది. నానీ లాగా నాలుగు పాదాల మినీ కవితలు ఇంతకు ముందు అసంఖ్యాకంగా వచ్చినవి. అయితే నాలుగు పాదాలే ఉండాలని అప్పుడు అనుకోలేదు. ఇప్పుడీ నాలుగు పాదాల్లో నిబంధించడం ఆకర్షనను పొందింది. అంటే ఇది ఒక నియతీకరణ (0. అలాగే నాలుగు పాదాల్లో ఒకొక్క పాదాన్ని ప్రయోగిమంచిన మినీ కవితలు వచ్చినవి. అయితే గభీరమైన సామాజిక చైతన్య భావాలు, శిల్ప స్పృహ ముఖ్యంగా భావించినవి ఈ "నానోలు". నానీ గానీ నానో గానీ ఈ నియతీకరణ వల్ల ఆకర్శనీయాలౌతై.

ఏ చిన్న రూపమైనా బతికేది కవి శక్తి వల్లనే. ఒక రూపాన్ని ఒక భావాన్ని ఒదిగించడంలోని శిల్పమే ఆ రూపాన్ని బతికిస్తుంది. లఘురూఫలలోనే ఒక రూపాన్ని మరో రూపన్నించి భిన్నంగా చూపించేది ఇదే. నాలుగు లేదా మూడు లేక రెండు పాదాలుగా రాసినా భేదం కనిపించకుండా ఉంటే అది విఫలమైన రూపం. అలా కాకుండా శబ్ధం లోని లయ భావం లోని లయ పాదాల సంఖ్యను అనివార్యం చెస్తే అది ఆ ప్రత్యేక రూపానికి ప్రాతింధ్యం పొందుతుంది.

హనుమాన్ నానోల్లో పైన చెప్పిన అంశాలన్ని సమగ్ర రూపంలో వున్నాయని నేను చెప్పడం లేదు. కానీ, ఈ అభివ్యక్తుల్ని తొంబై పాళ్ళ కవితల్లో అనుసరించగలిగాడు. ఈ అభివ్యక్తుల్ని ఇంకా ఇంకా విస్తృతం చేసుకొనే అవకాశం ఉంది.

కొత్తదనం పట్ల ఆసక్తి ఉండడం సృజన రంగంలో ఎప్పుడూ ప్రశంసనీయమే. అందుకు ఈగ హనుమాన్ ను అభినందిస్తున్నా.
డా|| అద్దేపల్లి రామమోహన రావు
ది:25-02-2006



1 comment:

  1. హనుమాన్ గారు పై నానోలు చాలా బాగున్నాయి.--తెలుగు అభిమాని

    ReplyDelete